‘రాక్షసరాజు’గా రానున్న రానా దగ్గుబాటి!

Hyderabad: టాలీవుడ్​ హల్క్​ దగ్గుబాటి రానా(Rana Daggubati) తమ్ముడు దగ్గుబాటి అభిరామ్(Daggubati Abhiram) హీరోగా ఎంట్రీ ఇస్తున్నా చిత్రం ‘అహింస’(Ahimsa). తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమాను .. ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై పి.కిరణ్‌ నిర్మించారు. ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అభిరామ్‌కు జోడీగా గీతి​కా తివారీ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా జూన్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్​లో జోరుగా పాల్గొంటోంది చిత్రబృందం. ఇటీవలే రానా దగ్గుబాటి ముఖ్య అతిథిగా ప్రీ రిలీజ్​ ఈవెంట్ కూడా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్​ తేజ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ తన అనుభవాలు, భవిష్యత్తు ప్రణాళికలను పంచుకుంటున్నారు.

వరుస ప్లాపులతో ఇబ్బందిపడ్డ తేజ రానా దగ్గుబాటి హీరోగా వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో సూపర్​ హిట్​ అందుకున్నారు. కాజల్​ అగర్వాల్​ హీరోయిన్​గా నటించిన ఈ సినిమాలో రానా నటన ప్రేక్షకులను మెప్పించింది. కాగా, రానా, తేజ కాంబినేషన్లో మరో సినిమా రూపొందనుందని ప్రకటించారు తేజ. అంతేకాదు ఈ సినిమాకు ‘రాక్షస రాజు’(Rakshasa Raju) అనే టైటిల్​ పెట్టనున్నట్లు తెలిపారు.
దగ్గుబాటి అభిరామ్​ హీరోగా వస్తున్న ‘అహింస’ ప్రేమ కథగా రూపొందుతోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్​, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మరి హీరోగా అభిరామ్​ ఎలా అలరిస్తాడో తెలియాలంటే జూన్​ 2 వరకు ఆగాల్సిందే!