చెరువులో ప‌డిన వ్య‌క్తి.. పీక్కుతిన్న 40 మొస‌ళ్లు!

Cambodia: ఓ వ్య‌క్తి చెరువులోని మొస‌ళ్ల‌ను చూస్తూ కాలుజారి ప‌డిపోయాడు (viral news). దాంతో ఏకంగా 40 మొస‌ళ్లు (crocodiles) అత‌న్ని పీక్కుతిన్నాయి. ఈ ఘ‌ట‌న కాంబోడియాలో (cambodia) చోటుచేసుకుంది. కంబోడియాలోని సియెం రీప్ (sien reap) అనే ప్రాంతంలో చాలా మంది సొంతంగా మొస‌ళ్ల‌ను (crocodiles) పెంచుతుంటారు. వాటి గుడ్లు, చ‌ర్మం ఇలా అన్నిటితో వ్యాపారం చేస్తుంటారు. అలా ఓ 70 ఏళ్ల వ్య‌క్తి కూడా త‌న ఇంటి వ‌ద్ద ఓ స్థ‌లంలో ఏకంగా 40 మొస‌ళ్ల‌ను పెంచుతున్నాడు. దాని ఓ చిన్న చెరువులా మార్చుకున్నాడు. ఈ నేప‌థ్యంలో ఓ మొస‌లి గుడ్లు పెట్టడంతో వాటిని బ‌య‌టికి తీద్దామ‌ని క‌ర్ర‌తో జ‌రిపాడు. దాంతో త‌ల్లి మొస‌లి క‌ర్ర‌ను నోటితో ప‌ట్టుకుని లాగ‌డంతో ప‌ట్టుజారి నీటిలో ప‌డిపోయాడు. అలా ఏకంగా 40 మొస‌ళ్లు అత‌న్ని నిమిషంలో పీక్కుతిన్నాయి. 2019లోనూ ఈ ప్రాంతంలో ఓ రెండేళ్ల చిన్నారి మొస‌ళ్ల‌కు బ‌లైపోయింది (viral news)