Jagan: గ్రూప్‌-1, 2 ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్

AP: ఏపీలో (ap) ప్రభుత్వ ఉద్యోగ ఆశావాహులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది (jagan). రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న గ్రూప్‌-1, గ్రూప్‌-2 ఉద్యోగాల‌ భర్తీ ప్రక్రియ చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఉద్యోగాల భర్తీ కోసం ఏపీపీఎస్సీకి సీఎం జగన్ గ్రీన్ (ap cm jagan) సిగ్నల్ ఇచ్చారు. దీంతో నోటిఫికేషన్ విడదలపై అధికారులు తుది కసరత్తు చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ లో మొత్తంగా గ్రూప్ 1 – 100, గ్రూప్ 2 – 900 ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. తాజా పోస్టుల భర్తీపై ఉన్నతాధికారులు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ కు వివరాలు అందించారు. సీఎం ఆదేశాల మేరకు ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ చురుగ్గా సాగుతోందని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలు తెప్పించుకున్నామని వీటి ఆధారంగా నోటిఫికేషన్‌ జారీకి అవసరమైన కసరత్తు చేపడుతున్నట్లు వివరించారు. నోటిఫికేషన్ జారీపై అధికారులు మాట్లాడుతూ ప్రస్తుత నోటిఫికేషన్ తో 1000కి పైగా పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. వీలైనంత త్వరలో దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ జారీచేయాలని సీఎం ఆదేశించారని, పరీక్షల నిర్వహణ, ఫలితాలు వెల్లడిలో పారదర్శకంగా వ్యవహరించడంపై దృష్టిసారించాలని సూచించినట్లు వెల్లడించారు.