Shah Rukh Khan: క్యాన్సర్​తో బాధపడుతున్న అభిమానితో వీడియో కాల్​!

Mumbai: బాలీవుడ్(Bollywood) స్టార్​ హీరో షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) నటనలోనే కాదు మంచితనంలోనూ బాద్​షా అని మరోసారి నిరూపించుకున్నారు. క్యాన్సర్ తో బాధపడుతున్న ఒక అభిమాని కోరిక తీర్చి గొప్ప మనసు చాటుకున్నాడు. . కోల్‌కతాకు చెందిన శివానీ చక్రవర్తి అనే 60 ఏళ్ళ మహిళ.. కొన్నేళ్ల క్రితం క్యాన్సర్ బారిన పడింది. క్యాన్సర్​తో పోరాడుతున్న ఆమె ప్రస్తుతం చివరి స్టేజీలో ఉంది. ఆమె ఇంకా కొన్ని నెలలు మాత్రమే బతుకుతుందని తేల్చి చెప్పారు వైద్యులు.

శివానీకి షారుఖ్​ అంటే వల్లమాలిన అభిమానం. షారుఖ్ ని ఒక్కసారైనా కలవాలని, తన చేతివంటని షారుఖ్ రుచి చూపించాలని ఎంతో ఆశపడేది. ఇక ఆమె కోరిక తెలుసుకున్న ఆమె కూతురు ఎలాగైనా ఆ కోరిక నెరవేర్చాలని అనుకుంది. ఈ క్రమంలోనే ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. అదికాస్త షారుఖ్ వరకు చేరుకోవడంతో.. ఆ అభిమాని కోరిక తీర్చేందుకు షారుఖ్ స్వయంగా వీడియో కాల్ చేసి శివానీ చక్రవర్తిని సంతోషపరిచాడు. దాదాపు 40 నిముషాలు పాటు ఆమెతో వీడియో కాల్ మాట్లాడాడు. అలాగే త్వరలోనే తన ఇంటికి వస్తానని, తన చేతి వంట తింటానని శివానీకి మాటిచ్చాడు.

అంతేకాదు ఆమె ట్రీట్మెంట్ కి ఆర్ధిక సహాయం చేస్తానని హామీ ఇచ్చాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో షారుఖ్ ని అభినందిస్తున్నారు నెటిజన్లు. కాగా ఈ ఏడాది పఠాన్(Pathan)​ తో భారీ హిట్​ అందుకున్న షారుఖ్ ప్రస్తుతం జవాన్ (Jawan), డంకీ (Dunki) సినిమాల్లో నటిస్తున్నాడు.