పెళ్లికొడుకుని ఈడ్చుకొచ్చి మ‌రీ తాళి క‌ట్టించుకుంది..!

Uttarpradesh: పెళ్లి రోజున త‌ప్పించుకోవాల‌ని చూసిన వ‌రుడిని మండ‌పం వ‌ర‌కు ఈడ్చుకొచ్చి మ‌రీ తాళి క‌ట్టించుకుంది ఓ యువ‌తి(viral news). ఈ ఘ‌ట‌న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో(uttarpradesh) చోటుచేసుకుంది. రేయీ బ‌రేలీకి చెందిన ఓ యువ‌తి అదే ప్రాంతానికి చెందిన ఓ వ్య‌క్తితో రెండున్న‌రేళ్లు ప్రేమ‌లో ఉంది. శారీర‌కంగానూ ద‌గ్గ‌ర‌య్యారు. ఎంతో క‌ష్ట‌ప‌డి ఒప్పిస్తే కానీ ఇరు కుటుంబాలు పెళ్లి ఓకే చెప్ప‌లేదు. దాంతో సింపుల్‌గా స్థానికంగా ఉండే భూతేశ్వ‌ర్‌నాథ్ ఆల‌యంలో నిన్న పెళ్లి జ‌ర‌గాల్సి ఉంది. అయితే ఈ పెళ్లి ఇష్టంలేని ఆ యువ‌కుడు ఎలాగైనా త‌ప్పించుకోవాల‌నుకున్నాడు. అంద‌రూ ఆల‌యంలో వెయిట్ చేస్తుంటే పెళ్లి కొడుకు మాత్రం రాలేదు. దాంతో ఆ యువ‌తి అత‌నికి ఫోన్ చేసి ఎక్క‌డున్నావ్ అని ఆరాతీసింది. ఎలాగైనా త‌ప్పించుకోవ‌డానికి ప్లాన్ వేసిన ఆ యువ‌కుడు అమ్మను తీసుకురావ‌డానికి బుదావ్ అనే ప్రాంతానికి వెళ్తున్న‌ట్లు చెప్పాడు. దాంతో ఆ యువ‌తికి అనుమానం వ‌చ్చి.. వెంట‌నే అత‌ను ఎక్క‌డున్నాడో క‌నుక్కుని వెళ్లింది. త‌న‌ను పెళ్లి చేసుకోకుండా పారిపోవాల‌నుకున్నాడ‌ని తెలిసి 20 కిలోమీట‌ర్ల పాటు ఈడ్చుకొచ్చి మండ‌పానికి తీసుకొచ్చింది. ఇక చేసేదేమీ లేక ఆ వ‌రుడు తాళిక‌ట్టాడు.