విజ‌య‌సాయి రెడ్డికి ఘోర అవ‌మానం

Vijaya Sai Reddy: సొంత నియోజ‌క‌వ‌ర్గంలో విజ‌య‌సాయి రెడ్డికి ఘోర అవ‌మానం జ‌రిగింది. ప్ర‌చారంలో భాగంగా నిన్న ఆయ‌న నెల్లూరులోని ఓ ప్రాంతంలో ప్ర‌సంగిస్తుంటే.. అక్క‌డి ప్ర‌జ‌లు వెన‌క్కి వెళ్లిపోయారు. దాంతో ప‌క్క‌నే ఉన్న YSRCP నేత‌లు భోజనాలున్నాయ్‌… తిన‌డానికైనా వెనక్కి రండి… పెద్దాయన మాట్లాడుతున్నాడు అని అరిచారు.

అయినా కూడా వారు విన‌కుండా వెళ్లిపోయారు. ఆ స‌మ‌యంలో వెళ్లిపోతున్న‌వారి వైపు మీడియా వ‌ర్గాలు కెమెరాలు తిప్పుతుంటే వ‌ద్దు వ‌ద్దు అని వారించారు. ఇంతలా ప్రాధేయ పడినా కూడా జనం స్పందించ‌డంలేదు. వైసీపీ ప్రాబల్యం బలంగా ఉందని చెప్పుకునే నెల్లూరులోనే ఈ దుస్థితి ఉంది. సొంత మీడియాల్లో ఎంత రుద్దినా,క్షేత్ర స్థాయిలో వాస్తవికత బయట పడుతోంది. ఈ నేప‌థ్యంలో ఇక వైసీపీ ఓటమి ఖరారే అని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.