YS Sunitha Reddy: చిన్నాన్న ఎన్నిక‌ల స‌మ‌యంలో గుర్తొచ్చాడా?

YS Sunitha Reddy: ఈ ఐదేళ్ల‌లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి (Jagan Mohan reddy) త‌న తండ్రి గుర్తుకు రాలేదు కానీ ఇప్పుడు ఎన్నిక‌ల స‌మ‌యం కావ‌డంతో గుర్తొచ్చారా అని మండిప‌డ్డారు వైఎస్ సునీతా రెడ్డి. నిన్న ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌సంగిస్తూ.. చిన్నాన్న‌ను ఎవ‌రు చంపారో ఎవ‌రు చంపించారో ఆయ‌న‌కు దేవుడికి తెలుసు. నిందితుడు ప్ర‌జ‌ల మ‌ధ్యే తిరుగుతుంటే అరెస్ట్ చేయించ‌కుండా స‌పోర్ట్ చేస్తున్నారు అంటూ జ‌గ‌న్ వ్యాఖ్యానించారు.

ఈరోజు వైఎస్ వివేకా హ‌త్య కేసులో విచార‌ణ‌కు సీబీఐ కార్యాల‌యానికి వెళ్లిన సునీత జ‌గ‌న్‌పై మండిప‌డ్డారు. ఇన్నాళ్లూ త‌న తండ్రిని ఒక్క‌సారి కూడా గుర్తుచేసుకోలేద‌ని.. ఇప్పుడు ఎన్నిక‌ల సమయం కావ‌డంతో మ‌ళ్లీ త‌న నాన్న పేరును వాడుకుని ఓట్లు కొట్టేయాల‌ని చూస్తున్నాడ‌ని అన్నారు. ఇప్ప‌టికైనా ప్ర‌జ‌లు ఆలోచించి ఓటు వేయాల‌ని సూచించారు. “” చంపినోడు నేనే చంపా అంటే నమ్ముతున్నోడివి ఎవరు చంపారో కూడా చెప్పాడు. మరి అది కూడా నమ్మాలి కదా, దీని వెనుక వైఎస్ జగన్ రెడ్డి, భారతి రెడ్డి ఉన్నారని చంపినోడే చెప్తున్నాడు. ద‌య‌చేసి మా అన్న‌కు, వైసీపీ పార్టీకి, నాన్న‌ను చంపిన ఎంపీ అవినాష్ రెడ్డికి ఓటు వేయ‌కండి “” అని ఆవేద‌న వ్య‌క్తం చేసారు.