AP BJP: బాబు తీరు బాగోలేదు..!

AP BJP: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన భార‌తీయ జ‌న‌తా పార్టీ సీనియర్ నేత‌లు.. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు (Chandrababu Naidu) ప‌ట్ల అస‌హ‌నంతో ఉన్నారు. సీట్ల షేరింగ్ విష‌యంలో ఈ ర‌చ్చ జ‌రుగుతోంది. ఎంత ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంలో ఉంటే మాత్రం ఏ సీట్ల‌లో ఏ పార్టీ పోటీ చేయాలో కూడా ఆయ‌నే నిర్ణ‌యిస్తే ఎలా అని ప్ర‌శ్నిస్తున్నారు. ఎక్క‌డైతే భార‌తీయ జ‌న‌తా పార్టీ గెల‌వ‌దో అవే ప్రాంతాల‌ను సీట్లుగా ఇస్తున్నారంటూ మండిప‌డుతున్నారు. భార‌తీయ జ‌న‌తా పార్టీ అడిగిన సీట్ల గురించి తేల్చ‌కుండానే ఈరోజు త‌న పార్టీకి చెందిన 35 సీట్ల‌ను ప్ర‌క‌టించేసార‌ని మండిప‌డుతున్నారు.

ఈ నేప‌థ్యంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ హై క‌మాండ్‌కు లేఖ రాసారు. దాదాపు 16 మంది సీనియ‌ర్ నేత‌లు చంద్ర‌బాబు నాయుడు ప‌ట్ల ఆగ్ర‌హంతో ఉన్నారు. బాబు తీరు బాలేదంటూ లేఖ‌లో పేర్కొన్నారు. గ‌త ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ఎక్క‌డ పోటీ చేసి ఓడిపోయిందో ఆ సీట్ల‌ను భార‌తీయ జ‌న‌తా పార్టీకి కేటాయించార‌ని ఆరోపిస్తున్నారు. రేపో మాపో ఎన్నిక‌ల న‌గారా మోగ‌నున్న నేప‌థ్యంలో ఇప్పుడే త‌మ బాధ‌ల‌ను చెప్పుకుంటో హై క‌మాండ్ ఆలోచించి నిర్ణ‌యం తీసుకుంటుంద‌న్న ఉద్దేశంతో లేఖ రాసిన‌ట్లు వెల్ల‌డించారు.

ALSO READ: Chandrababu Naidu: సీనియ‌ర్ల‌కు చంద్ర‌బాబు బిగ్ షాక్!

ALSO READ: పొత్తు జ‌గ‌న్‌ను ఓడించేందుకు కాదు..!