Chandrababu Naidu: పొత్తు జ‌గ‌న్‌ను ఓడించేందుకు కాదు..!

Chandrababu Naidu: తెలుగు దేశం పార్టీ అధినేత పార్టీ నేత‌ల‌తో టెలీ కాన్ఫారెన్స్ ద్వారా స‌మావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా వారిని అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిందిగా అలెర్ట్ చేసారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ఉమ్మ‌డి స‌భ‌ను విజ‌య‌వంతం చేయాల‌ని పిలుపునిచ్చారు. విభేదాలు వీడ‌నాడి గెలుపు కోసం క‌లిసి ప‌నిచేయాల‌ని అన్నారు. ఈసారి రెండు పార్టీల‌తో పొత్తు పెట్టుకుంది జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఓడించ‌డానికి కాద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని కాపాడుకునేందుక‌ని తెలిపారు. విధ్వంస పాల‌న‌తో ఆల్రెడీ రాష్ట్రం 20 ఏళ్లు వెన‌క్కి వెళ్లింద‌ని అన్నారు. మ‌ళ్లీ రాష్ట్రాన్ని పైకి లేప‌డానికి ఈ పొత్తు అని తెలిపారు. అధికారంలోకి వ‌చ్చాక పోల‌వ‌రం పూర్తి చేసి రాజ‌ధానిని నిర్మించాల‌ని పిలుపునిచ్చారు.