KCR: కాంగ్రెస్ గెలిచింద‌న్న కుళ్లు మాకు లేదు

KCR: తెలంగాణ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి వ‌చ్చింద‌న్న కుళ్లు, ఈర్ష్య త‌మ‌కు లేద‌ని అన్నారు భార‌త రాష్ట్ర స‌మితి అధినేత KCR. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చింది కాబ‌ట్టి త‌మ కంటే బాగా పాల‌న చేయాల‌ని కోరుకుంటున్న‌ట్లు తెలిపారు. మిష‌న్ బ‌గీర‌థను న‌డిపే శ‌క్తి కాంగ్రెస్‌ను లేదా అని ప్ర‌శ్నించారు. రైతు బంధు ప‌డ‌క‌పోతే రైతులు ఆవేద‌న వ్య‌క్తం చేసే హ‌క్కు వారికి ఉంటుంద‌ని.. అలా అడిగితే చెప్పుతో కొడ‌తాన‌ని మొన్న ఓ మంత్రి అన్నార‌ని KCR మంప‌డ్డారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే ఆరు గ్యారెంటీల‌కు ఎగ‌నామం పెడ‌తార‌ని విమ‌ర్శించారు. రూపాయి ప‌నిచేయ‌ని భార‌తీయ జ‌న‌తా పార్టీకి మాత్రం ఎందుకు ఓటేయ్యాల‌ని ప్ర‌శ్నించారు. లోక్ స‌భ ఎన్నిక‌ల్లో గులాబీ జెండా ఎగ‌రాల‌ని.. స‌రిగ్గా ఎన్నికల స‌మ‌యానికి పార్టీలు మారే వారి గురించి ప‌ట్టించుకోవ‌ద్ద‌ని తెలిపారు. మేడిగ‌డ్డ‌తో రెండు పిల్ల‌ర్లు కుంగినందుకే బద్నాం చేస్తున్నార‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు.

ALSO READ: భార్య స్థానంలో కూతురు.. ఇలా ఎందుకు ప్ర‌క‌టించారు?