KA Paul: ముద్ర‌గ‌డ గారూ.. అడుక్కు తినండి

KA Paul: కాపు సంఘం నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభంపై (Mudragada Padmanabham) ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు కేఏ పాల్ మండిప‌డ్డారు. ఈరోజు ఆయ‌న త‌న కుమారుడు గిరితో పాటు YSRCP పార్టీలో చేరుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీనిపై పాల్ స్పందిస్తూ.. ఇండిపెండెంట్‌గా పోటీ చేయండి.. లేదా ప్ర‌జాశాంతిలో చేరండి ముఖ్య‌మంత్రి అభ్య‌ర్ధిగా ప్ర‌క‌టిస్తా అని చెప్తే.. అది వ‌దిలేసి మ‌ళ్లీ  YSRCPలోకి వెళ్లడం ద‌రిద్రం అని.. ఈ బతుకు బ‌తికే కంటే చిప్ప ప‌ట్టుకుని అడుక్కు తిన‌డం మంచిద‌ని విమ‌ర్శించారు. ఇక కాపులు, బీసీలు ఇలా అడుక్కుంటూనే ఉండాలా అని ప్ర‌శ్నించారు.