Viral News: బిడ్డ‌ను పొర‌పాటున ఓవెన్‌లో పెట్టేసిన త‌ల్లి..!

Viral News: ఈ మ‌ధ్య‌కాలంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ రీల్ తెగ ఫేమ‌స్ అవుతోంది. అఫ్‌కోర్స్ రోత రోత రీల్స్ అన్నీ ఇన్‌స్టాగ్రామ్‌లోనే క‌నిపిస్తాయ‌నుకోండి. ఆ రీల్ సందేశం ఏంటంటే.. ఓ మ‌హిళ ఒక చేతిలో చెత్త క‌వ‌రు మ‌రో చేతిలో బిడ్డ‌ను (Baby) సంక‌నెత్తుకుని చెత్త పారేయ‌డానికి వెళ్తుంది. అయితే మ‌ర్చిపోయి చెత్త‌ను పారేయ‌బోయి బిడ్డ‌ను విసిరేసి చెత్త క‌వ‌రుతో ఇంటికి వ‌స్తుంది. తాను ప‌డేసింది బిడ్డ‌ను అని తెలుసుకుని ప‌రిగెత్తుకుంటూ వెళ్తుంది.

ఇలాంటి రీల్స్ చూసి న‌వ్వుకోవ‌డానికి బాగుంటాయి. ఇంకొంద‌రైతే ఇలాంటి రీల్స్ చేయ‌కండి అని బూతులు కూడా తిడుతుంటారు. ఇప్పుడు ఈ రీల్ నిజంగానే జ‌రిగింది అంటే న‌మ్ముతారా? న‌మ్మాల్సిందే. ఎందుకంటే ఇలాంటి ఘ‌ట‌న నిజంగానే జ‌రిగింది కాబ‌ట్టి. ఓ క‌న్న‌త‌ల్లి ఏం ఆలోచిస్తోందో ఏ లోకంలో ఉందో కానీ బిడ్డ‌ను ఊయ‌ల‌లో పెడుకోబెట్ట‌బోయి ఓవెన్‌లో పెట్టేసింది. అంతేకాదు.. ఓవెన్ ఆన్ చేసి పెట్టేసింది. కాసేపు త‌ర్వాత బిడ్డ గుర్తొచ్చి ఇల్లంతా తెగ వెతికేసింది. తీరా చూస్తే బిడ్డ ఓవెన్‌లో కాలిపోయి శ‌వమై క‌నిపించేసరికి ఆమె గుండె ప‌గిలింది.

ఈ దారుణ ఘ‌ట‌న అమెరికాలోని కాన్సాస్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. కాన్సాస్‌కు చెందిన మ‌రియా థామ‌స్ అనే మ‌హిళ ఫిబ్ర‌వ‌రి 9న పోలీసుల‌ను పిలిపించింది. ఏం జ‌రిగింది అని పోలీసులు ప్ర‌శ్నించ‌గా.. కుక్క‌ర్‌ను ఊయ‌ల అనుకుని త‌న బిడ్డ‌ను అందులో పెట్టేసి ఓవెన్‌లో పెట్టేసాన‌ని..దాంతో త‌న బిడ్డ చ‌నిపోయాడ‌ని బోరున విల‌పించింది. ఇది విని పోలీసుల గుండె చ‌లించిపోయింది. ఇంత‌టి ఘోర‌మైన త‌ప్పు ఎలా చేస్తారు అని వారు చెడామ‌డా తిట్టేసారు. తెలిసి చేసినా తెలీక చేసినా త‌ప్పు త‌ప్పే కాబ‌ట్టి మ‌రియాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ నెల‌ల చిన్నారికి డైప‌ర్ వేయాల్సింది పోయి బాడీసూట్ వేసింది. ఆ బాడీసూట్ ర‌బ్బ‌ర్ కావ‌డంతో వెన‌క భాగంలో తీవ్రంగా కాలిపోయింది. బిడ్డ‌ను ఓవెన్‌లో పెట్టిన కొన్ని సెకెన్ల‌లోనే మ‌ర‌ణించిన‌ట్లు తెలుస్తోంది. (Viral News)

అయితే.. కావాల‌నే బిడ్డ‌ను వ‌దిలించుకోవాల‌ని ఓవెన్‌లో పెట్టి కాక‌మ్మ క‌బుర్లు చెప్తోందా అనే కోణంలో కూడా పోలీసులు విచార‌ణ చేప‌డుతున్నారు. ఎందుకంటే అమెరికాలో ఈ మ‌ధ్య ఇలాంటి ఘ‌ట‌న‌లు చాలానే జ‌రుగుతున్నాయి. ఇటీవ‌ల ఓ త‌ల్లి బిడ్డ‌ను వ‌దిలించుకోవాల‌ని తిండి పెట్ట‌కుండా పాలు, నీళ్లు ఇవ్వ‌కుండా క‌డుపు మాడ్చి చంపేసింది. మ‌రో ఘ‌ట‌న‌లో విహార‌యాత్ర‌కు వెళ్లాల‌న్న కోరిక‌తో బిడ్డ‌ను ఇంట్లోనే వ‌దిలేసి వెళ్లిపోయింది. దాంతో పోలీసులు ఆమెను ఎన్‌కౌంట‌ర్ చేయాల‌ని అనుకున్నారు. కానీ అక్క‌డి న్యాయ‌స్థానం క‌ఠిన కారాగార శిక్ష విధించింది.

ఎంత ప‌ర‌ధ్యానంలో ఉంటే మాత్రం బిడ్డ‌ను ఓవెన్‌లో పెట్టి వదిలేయ‌డం ఏంటి అని నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. అస‌లు ఈ వార్త నిజ‌మా కాదా అనే సందేహాలు కూడా వ్య‌క్తం అవుతున్నాయి. ఒక‌వేళ నిజ‌మే అయితే మాత్రం క‌చ్చితంగా బిడ్డ‌ను వ‌దిలించుకునేందుకు కావాల‌ని క‌న్న‌త‌ల్లే ఓవెన్‌లో పెట్టి వ‌దిలేసింద‌ని ఆరోపిస్తున్నారు. ఎంతటి ప‌ర‌ధ్యానంలో ఉన్నా తీవ్ర‌మైన మ‌తిప‌రుపు స‌మ‌స్య‌లు ఉన్నావారైనా కూడా ఇంత‌టి దారుణ‌మైన పొర‌పాటును అస్స‌లు చేయ‌రు అని అంటున్నారు.