Narendra Modi: 400 సీట్ల‌తో మ‌ళ్లీ వ‌స్తా

Narendra Modi: ఈసారి లోక్ స‌భ ఎన్నిక‌ల్లో (lok sabha elections) BJP కి 370 సీట్లు వ‌స్తాయ‌ని NDAకి 400 సీట్లు వ‌చ్చి తామే కేంద్రంలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటుచేస్తామ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ తెలిపారు. 2022 నుంచే మ‌ళ్లీ తానే ప్ర‌ధాని అవుతాన‌ని మోదీ ధీమా వ్య‌క్తం చేస్తూ వచ్చారు. 2023 స్వాతంత్ర్య దినోత్స‌వ సంద‌ర్భంగా కూడా 2024 స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌ల స‌మ‌యంలో ఎర్ర కోట‌పై మ‌ళ్లీ తానే ప్ర‌ధాని అవుతాన‌ని అన్నారు. దాంతో ప్ర‌తిపక్షాలు మోదీ ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నార‌ని ఈసారి ఆయ‌న ఎర్ర‌కోట‌పై జెండా మ‌రో ప్రధాని ఎగ‌రేయ‌డం మాత్ర‌మే చూస్తార‌ని సెటైర్లు వేసారు.