JD Lakshmi Narayana: ఏపీకి ప్ర‌త్యేక హోదా తీసుకురావ‌డానికే నా కొత్త పార్టీ

JD Lakshmi Narayana: మాజీ జేడీ ల‌క్ష్మీ నారాయ‌ణ జై భార‌త్ (jai bharat) పేరిట కొత్త పార్టీని పెట్టారు. 2024లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగే ఎన్నిక‌ల్లో ఈయ‌న పోటీ చేయ‌నున్నారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా తీసుకురావ‌డానికే ఈ పార్టీ పెట్టాన‌ని అన్నారు. వార‌స‌త్వ రాజ‌కీయాలు ఎక్కువ అవుతున్నాయని TDP పార్టీపై కామెంట్స్ చేసారు. ఒక‌రు జాతీయ క‌మాండోల చాటున మ‌రొక‌రు ప‌ర‌దాల చాటున దాక్కుంటూ త‌మ‌ని తాము ర‌క్షించుకుంటున్నార‌ని ఏపీ ప్ర‌జ‌ల ర‌క్ష‌ణ‌ను మాత్రం గాలికి వ‌దిలేసార‌ని విమ‌ర్శించారు. రాజ‌కీయాలంటే సుప‌రిచిత పాల‌న అని నిరూపిస్తామ‌ని హామీ ఇచ్చారు. అప్పు చేయం త‌ప్పు చేయం అని తెలుపుతూ ఏపీ రాష్ట్రాన్ని గుజ‌రాత్ కంటే ముందుకు తీసుకెళ్తాన‌ని ధీమా వ్య‌క్తం చేసారు.