Mansoor Ali Khan: నువ్వెలా కేసు వేస్తావు.. హైకోర్టు మంద‌లింపు

Mansoor Ali Khan: త్రిష‌పై (trisha) త‌ప్పుడు కూత‌లు కూసిందే కాక పైగా చిరంజీవి, నితిన్, ఖుష్బూ వంటి సెల‌బ్రిటీలు త‌న గురించి త‌ప్పుగా మాట్లాడార‌ని మ‌ద్రాస్ హైకోర్టులో ప‌రువు న‌ష్టం దావా వేసారు న‌టుడు మ‌న్సూర్ అలీ ఖాన్‌. అంద‌రూ ఊహించిన‌ట్లుగా ఆ కేసు చెల్ల‌లేదు. పైగా మ‌ద్రాస్ హైకోర్టు మ‌న్సూర్‌కి మొట్టికాయ‌లు వేసింది. కేసు వేయాల్సింది త్రిష క‌దా.. మీరెలా వేస్తారు? అయినా ఇలాంటి ప‌నికిమాలిన కేసు వేస్తే విన‌డానికి మాకు స‌మ‌యం లేదు అంటూ కేసును కొట్టిపారేసింది. దాంతో మ‌న్సూర్ తెల్ల ముఖం వేసుకుని ఇంటి బాట‌ప‌ట్టాల్సి వ‌చ్చింది.