Ravindra Jadeja: ఫ్యాన్స్‌కే ఇంకా అర్థం కాలేదు..!

Hyderabad: చెన్నై సూప‌ర్ కింగ్స్ (csk) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి (ms dhoni).. ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజాకు (ravindra jadeja) మ‌ధ్య ఏదో జ‌రిగింది. శ‌నివారం జ‌రిగిన సీఎస్‌కే (chennai super kings), డీసీ (delhi capitals) మ్యాచ్‌లో 77 ర‌న్స్‌తో చెన్నై విన్ అయింది. మ్యాచ్ త‌ర్వాత గ్రౌండ్‌లో ధోనీకి (dhoni), జ‌డేజాకి  మ‌ధ్య ఏదో గొడ‌వ జ‌రిగింది. అయితే వారిద్ద‌రూ దేని గురించి గొడ‌వ‌పడ్డారు అన్న విష‌యం మాత్రం తెలీలేదు. అదీకాకుండా నిన్న జ‌డేజా అప్‌స్టాక్స్ సంస్థ‌తో పార్ట్‌న‌ర్ అవుతున్న‌ట్లు ఓ ట్వీట్ చేసాడు. అప్పుడు పెట్టిన ఓ ట్వీట్ హాట్ టాపిక్‌గా మారింది. అప్‌స్టాక్స్‌కి కూడా తెలుసు.. కానీ కొంద‌రు ఫ్యాన్స్‌కే ఇంకా తెలీదు అని ట్వీట్ చేసారు. దీనిని బ‌ట్టి చూస్తే ధోనీ ఫ్యాన్స్ ఏమ‌న్నా జ‌డేజాను టార్గెట్ చేసి సోష‌ల్ మీడియాలో ఎటాక్స్ చేస్తున్నారా అనే చ‌ర్చ కూడా మొద‌లైంది. అదీ కాకుండా జ‌డేజా ఎవరైనా ఖ‌ర్మ అనుభ‌వించ‌క త‌ప్ప‌దు అని పెట్టిన ట్వీట్ మరింత వైర‌ల్ అవుతోంది. అయితే దీనిపై ధోనీ కానీ జ‌డేజా కానీ స్పందించ‌లేదు.

మ‌రో విష‌యం ఏంటంటే.. ఎప్పుడు సీఎస్‌కేతో మ్యాచ్ ఉన్నా కూడా 70% స్టేడియంలో ధోనీ ఫ్యాన్సే ఉంటార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. అయితే జ‌డేజాకు అంత పాపులారిటీ ఇంకా రాలేదు. మ్యాచ్‌ల స‌మ‌యంలో ధోనీ బ్యాటింగ్ చేసే ఛాన్స్ రావ‌డం చాలా త‌క్కువ‌. జ‌డేజా బ్యాట్ ప‌ట్టుకుని ఎప్పుడు గ్రౌండ్‌లోకి వ‌చ్చినా ఫ్యాన్స్ జ‌డేజాని చీయ‌ర్ అప్ చేయ‌కుండా ధోనీ ధోనీ అనే అరుస్తుంటారు. పైగా చాలా మంది సీఎస్‌కే గెల‌వాల‌ని కాకుండా జ‌డేజా ఓడిపోతే త‌ర్వాత ధోనీ బ్యాటింగ్‌కి వ‌స్తారు అన్న ఆశ‌తోనే స్టేడియంకి వ‌స్తున్నారు. జ‌డేజా ఆడుతున్న ప్ర‌తిసారీ ఔట్ అయిపో మా ధోనీ వ‌స్తాడు అన్న అరుపులు కూడా వినిపిస్తుంటాయి. ఇవి జ‌డేజాని చాలా బాధించిన‌ట్లున్నాయని క్లియ‌ర్‌గా తెలుస్తోంది.