Dhanush: 40 ఏళ్ళ వయస్సులో యూత్​ ఐకాన్​ అవార్డ్​!

Chennai: కోలీవుడ్ స్టార్ ధనుష్​(Dhanush)కి దక్షిణాదితోపాటు పాన్ ఇండియా లెవల్లో ఫాలోయింగ్ ఉంది. పాన్ ఇండియా(Pan india) సినిమాలు చేయకపోయినా ధనుష్​కి దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ‘రాన్ జానా’(Raan Jhanaa) అనే ఒక్క సినిమాతోనే బాలీవుడ్(Bollywood)​లోనూ మంచి ఫాలోయింగ్​ సాధించారు. భిన్నమైన కథల ఎంపికతో దక్షిణాది(South) నటుల్లో ధనుష్​ ఎప్పుడూ ప్రత్యేకంగా నిలుస్తున్నారు. నటుడిగా పలు అవార్డులు అందుకున్న ధనుష్​కి తాజాగా మరో అరుదైన గౌరవం దక్కింది. నలభై ఏళ్ల వయస్సులో యూత్ ఐకాన్ అవార్డ్(Youth Icon award) అందుకున్నారు. భారత పరిశ్రమల సమాఖ్య (CII) ఆధ్వర్యంలో `దక్షిణ్ 2023` పేరుతో రెండు రోజుల పాటు చెన్నైలో నిర్వహించిన సౌత్ ఇండియా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ధనుష్​కి ‘యూత్ ఐకాన్’ అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ..‘40 యేళ్ళ వయసులో యూత్ ఐకాన్ అవార్డు అందుకోవడం మరిన్ని చిత్రాలు చేసేలా ప్రోత్సహిస్తుంది. నేను ఈ స్థాయికి చేరుకోవడానికి నా తల్లిదండ్రుల కృషే కారణం. ఈ క్రెడిట్ అంతా వాళ్లకే చెందుతుంది’ అన్నారు ధనుష్​. ఇక, సోషల్ మీడియా వేదికగా ధనుష్ అభిమానులు శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు. 40 ఏళ్ల వయసులో యూత్ ఐకాన్ అవార్డు అందుకుని యువతకి ఆదర్శంగా నిలిచారని అభినందిస్తున్నారు. నటుడిగా జీవితంలో మరిన్ని శిఖరాలు అధిరోహించాలని…హాలీవుడ్ లో సైతం రాణించాలని కోరుకున్నారు. ఇప్పటికే ధనుష్ హాలీవుడ్ లో లాంచ్ అయిన సంగతి తెలిసిందే.